Friday 19 September 2014

మళ్ళీ చప్పట్లు !

అప్పుడెప్పుడో వచ్చిన హిందీ సినిమా "తేజాబ్" గుర్తుందిగా? అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ నటించారు. మాధురీ 'ఏక్ దో తీన్ పాట ఒక ఊపు ఊపేసింది అప్పట్లో.  దాన్ని తెలుగులో కూడా తీసారు. వెంకటేష్, రాధ హీరో, హీరోయిన్లు. యిదంతా తెలిసిన విషయమే. బానే ఉంది. ఆ సినిమాకి సంబంధించిన యింకో విషయం చెప్పనా? తేజాబ్ సినిమాని తెలుగులో మళ్ళీ యింకో సారి తీసారు. కాకపోతే మక్కీకి మక్కీ కాకుండా దాదాపు అదే కధతో అన్నమాట. ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లు. సినిమా గుర్తొచ్చిందా? సరే చెప్పేస్తున్నా. "వర్షం". అవును. "వర్షం" సినిమా తేజాబ్ కధాంశంతో తీసిన సినిమానే. M.S.రాజు మంచి తెలివిగా తీసాడు, ఎక్కడా తేజాబ్ సినిమా గుర్తు రాకుండా. ఆయన తీసిన యింకో సినిమా "నువ్వొస్తానటే నేనొద్దంటానా?" సినిమా కూడా అదే బాపతు. హిందీ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా "మైనే ప్యార్ కియా" సినిమా కధాంశంతో తీసిన సినిమా అది. భలే ఉంది కదా?!  

No comments:

Post a Comment