Sunday 17 August 2014

ఆ ముగ్గురూ...

నాకు తెలిసీ మొదటి సినిమాతోనే ఉర్రూతలూగించిన హీరోయిన్లు ముగ్గురున్నారు మన తెలుగు సినీ పరిశ్రమలో. వాళ్ళు ఎవరంటే " దివ్య భారతి, ఇలియానా, నిత్యా మీనన్ '. కేవలం వీళ్ళు ముగ్గురు మాత్రమే "మొదటి సినిమా ద్వారా విపరీతమైన పేరు, పాపులారిటీ తెచ్చుకున్నారు. బాగా పాపులరైన హీరోయిన్లు చాలా మంది ఉండొచ్చు. కానీ వాళ్ళంతా తరువాతి సినిమాల ద్వారానే పేరు తెచ్చున్నవాళ్ళే. ఉదహారణకి దివ్యభారతిని గుర్తు తెచ్చుకోండి. "బొబ్బిలి రాజా" సినిమాలో అందరినీ ఎంత సమ్మోహనపరిచిందో. ఆ సినిమా ఆడుతున్నంత సేపూ ఆమె గురించి టాపిక్ లేని ప్రాంతము, రోజు లేదంటే నమ్మండి. కేవలం ఆమె కోసమే బొబ్బిలి రాజా సినిమాని పది సార్లు యిరవై సార్లు చూసిన వాళ్ళున్నారు. ఆమె రెండో సినిమా ఎప్పుడొస్తుందాని కళ్ళు కాయలు కాచేలా చూసారు జనం. అలాగే ఇలియానా. తన అందచందాలతో ప్రేక్షకుల్ని కట్టిపారేసిందామె. యిక నిత్యా మీనన్ సంగతి వేరు. అందం, అభినయం, గాత్రం ఈ మూడింటిని కలిగలిపి ప్రేక్షకులని సంభ్రమాశ్చర్యపరిచిన నటి ఈమె. కాజల్, అనుష్క, తమన్నా, శృతి హాసన్, కాజల్, సమంతా లాంటి వాళ్ళు అందం, నటనతో పైకొచ్చిన వాళ్ళే. కానీ కేవలం హిట్టు సినిమాల కారణంగానే పైకొచ్చారు తప్ప నేను చెప్పిన ఆ ముగ్గురిలాగ "ఫస్ట్ సినిమా" వండరు కాదు.       

No comments:

Post a Comment