Saturday 30 August 2014

కాలనీ బస్సులు

'పల్లె వెలుగు' బస్సుల స్థానం లో మినీ బస్సులు ప్రవేశపెడతారంట. ఎందుకో మరి? యిప్పుడున్న బస్సుల్లోనే కిక్కిరిసిపోయేంత జనముంటున్నారు. మరి మినీ బస్సుల్లో యింత మంది జనాన్ని ఎలా పట్టిస్తారు? పోనీ బస్సుల సంఖ్య పెంచుతారా అంటే ఖచ్చితంగా పెంచరు గాక పెంచరు. ఎందుకంటే బస్సుల్ని పెంచగలరేమో గానీ డ్రైవర్లు, కండక్టర్ల సంఖ్యని పెంచలేరు కదా? అంటే ఎన్ని పల్లె వెలుగు బస్సులు పోతాయో అన్ని మినీ బస్సులు వస్తాయన్న మాట.  దీనికి పరిష్కారమొక్కటే. ముందు డ్రైవర్ల సంఖ్యని పెంచాలి. పల్లె వెలుగు బస్సులని అలాగే ఉంచాలి. మినీ బస్సులని కూడా ప్రవేశపెట్టాలి. కాకపోతో వాటిని దూర ప్రాంతాలకు కాకుండా అదే ఊరిలో ఆటోలు, రిక్షాలు తిరిగే కాలనీల్లో తిరిగేటట్టు చేయాలి. అంటే సిటీ బస్సుల్లా అన్నమాట. కాకపొతే అవి కాలనీల్లో తిరగవు, ఇవి తిరుగుతాయి. దాని వలన ఆదాయానికి ఆదాయం -  ఆటోల్లో యిరుక్కొని కూర్చునే బాధా తప్పుతుంది. ఈ విధానము అంటే కాలనీల్లో బస్సులు తిరగడమన్నది తమిళనాడులో సంవత్సరం నుండి విజయవంతంగా నడుపుతున్నారు. 

No comments:

Post a Comment