Sunday 22 December 2013

ఏమిటీ డబ్బింగు గోల?

వసంత కోకిల సినిమా గుర్తుందా మీకు? కమల్ హాసన్, శ్రీదేవి నటన అదిరిపోతుంది కదా? ఆ సినిమాని తమిళ్ లో తీసి తెలుగులో డబ్బింగ్ చేసారు. శ్రీదేవికి డబ్బింగు చెప్పిందెవరో తెలుసా? "S.P.శైలజ". అవును. అంతే కాదు నిరీక్షణ సినిమాలో అర్చనకి డబ్బింగు చెప్పింది ఎవరో తెలుసా?  "రోజారమణి". అంతే కాదు నటి విజయశాంతి తన నట జీవితం మొత్తములో స్వంతంగా డబ్బింగ్ చెప్పిన మొదటి చిత్రం "ఒసేయ్ రాములమ్మ". నటుడు రాజశేఖర్ ఇంతవరకు తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకోలేదు. సాయికుమార్ అతనికి డబ్బింగ్ చెపుతాడు. సుమన్ కి కూడా అదే పరిస్థితి. ఒక సారి వారిద్దరూ (సుమన్, సాయికుమార్) నటించాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా పేరు "దోషి-నిర్దోషి". ఆ సినిమాలో సుమన్ కి సాయికుమార్ డబ్బింగ్ చెప్పాడు. మరి సాయికుమార్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా? రవిశంకర్. అంటే సాయికుమార్ తమ్ముడన్నమాట. ఈ మధ్య అరుంధతి సినిమాలో నటుడు 'సోనూసూద్' కి వాయిస్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే కమలహాసన్ తన స్ట్రెయిట్ తెలుగు చిత్రాలకి మాత్రమే డబ్బింగ్  చెప్పుకుంటాడు. తమిళం నుండి డబ్ అయిన చిత్రాలకు చెప్పడు. వాటికి 's.p.బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెపుతాడు. మన రాజమండ్రి M.P ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ సినిమాలో ఓ పాత్రకి (హీరోయిన్ తండ్రి ) తన వాయిస్ ఇచ్చాడు అచ్చమైన తూర్పు గోదావరి యాసలో. అది మలయాళం నుండి తెలుగు కి అనువదింపబడిన సినిమా. పేరు "జర్నలిస్టు". సురేష్ గోపి, మంజు వారియర్ నటీనటులు. ఆ డబ్బింగు వెర్షన్ కి నిర్మాత కూడా ఆయనే. 

No comments:

Post a Comment