Friday 20 September 2013

ముష్టియా

మీరెవరో తెలియకపోయినా, మీరెలాంటివారైనా, మీరు పలకరించినా పలకరించకపోయినా, మిమ్మల్ని పలకరించే వాడొకడున్నాడు. వాడే "బిక్షగాడు". అడుక్కునేవాడు, ముష్టివాడు ఇలా బోలెడు ముద్దు పేర్లు ఉన్నాయతనికి. సరే ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే ఈ అడుక్కోవటం అనేది మారుతున్న టెక్నాలజీ లానే అది కూడా మారిపోయింది. వాళ్ళు కూడా తమ పంధాని మార్చుకున్నారు. ముసలివారు, వికలాంగులని మినహాయిస్తే చాలా మంది ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా అడుక్కోవటం మొదలెట్టారు. ట్రైనుళ్ళో చిన్న చిన్న అమ్మాయిలకి పెళ్ళికూతురు అలంకారము చేసి అడుక్కోవటం, అనాధ పిల్లలకి డొనేషను కావాలంటూ అడుక్కోవటం లాంటివి కాకుండా కొత్త తరహా అడుక్కోవటం మొదలయ్యింది. కొన్ని రోజుల క్రిందట దేవీ చౌక్ లో ఏదో కొంటుండగా ఒకతన్ను నా దగ్గరకొచ్చి "ఆప్ కో హిందీ మాలూం హై?" అని అన్నాడు. అతనితో పాటు అతని వెనకాల అతని భార్య అనుకుంటా ఒక పిల్లాడిని చేతిలో ఎత్తుకుని ఉంది. నా వచ్చీ రాని హిందీ టేలెంట్ ని అతని దగ్గర చూపిద్దామని "హా బొలో" అన్నాను ఉత్సాహంగా. అప్పుడు మొదలెట్టాడు 'వాళ్ళంతా ట్రైన్ లో వెళుతుండగా ఎవరో డబ్బులు కొట్టేసారని, చేతిలో డబ్బులు లేకపోవటముతో యిక్కడే ఉండిపోయామనీ, ఏదైనా సహాయం చేయమని చెప్పుకొచ్చాడు. సరే ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని ఓ పది రూపాయలు అతనికిచ్చాను. కానీ అతను నన్ను వదిలిపెట్టలేదు. యింకా యిమ్మని పట్టుకున్నాడు. అతన్ని వదిలించుకొనేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. ఇది జరిగిన కొన్నాళ్ళకు మళ్ళీ ఇలాంటి బ్యాచ్ ఒకటి తగిలింది. అందులొ ఒకడు షరా మామూలుగా నా దగ్గరకొచ్చి "ఆప్ కో హిందీ మాలూం హై?" అని అడిగాడు. దానికి నేనిచ్చిన సమాధానం విని అతను షాక్ కి గురయ్యాడు. నేనేం చెప్పానో ఈ ఆర్టికల్ చివరలో చదవండి.        

నేను ఉద్యోగం లో చేరిన కొత్తలో ఓ కుర్రాడు వచ్చాడు మా ఆఫీసుకి. చాలా నీట్ గా యిన్ షర్ట్ చేసుకొని ఉన్నాడు. వచ్చిన వెంటనే చెప్పాడు తాను AMIE ప్రైవేట్ గా చదువుతున్నాననీ, ఫలానా సార్ దగ్గర ట్యూషను చెప్పించుకుంటున్నాననీ, ఆర్ధిక స్తోమత లేకపోవటం వలన ఫీజులకి, పుస్తకాలకి డబ్బులు సరిపోవటం లేదనీ ధన సహాయం చేయమని ప్రాధేయపడ్డాడు. అసలే IETE చేస్తూ మధ్యలో మానేసిన నాకు ఆ అబ్బాయిని చూస్తే చాలా జాలేసింది. అందరి కంటే ఎక్కువ 'చదివించాను' కూడా. మొత్తానికి ఆ రోజు మంచి కల్లెక్షనుకింగు లా వెళ్ళాడు అతను. ఇది నల్గొండ లో ఉన్నప్పుడు జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు రాజమండ్రికి ట్రాన్స్ ఫర్ మీద రావటం జరిగింది. రాజమండ్రి లో ఉండగా ఓ పది రోజులు గుంటూరు కి డిపార్ట్ మెంట్ పని మీద వెళ్ళల్సొచ్చింది. అక్కడ పని చేస్తుండగా మళ్ళీ ఈ కలెక్షను కింగు అక్కడికి వచ్చాడు. అతడిని చూసి ఆశ్చర్యపోయా. మళ్ళీ అదే గెటప్. మళ్ళీ అందరి దగ్గరికొచ్చి అదే స్టోరీ వినిపిస్తున్నాడు. ఈ సారి గుంటూరు లోని ఓ సారు పేరు చెప్పాడు. కధ మామూలే. మామూలుగా అయితే అర్ధ రూపాయి కూడ ఖర్చు పెట్టని వాడు కూడా 50 రూపాయలు, 100 రూపాయలు రాయటం నాకు భలే ఆశ్చర్యమేసింది. అందరూ  అయిపోయాక నా దగ్గరకొచ్చాడు. నన్ను చూసిన వెంటనే కొంచెం ఖంగారు పడినట్టు అతని మొహము చెపుతోంది. అయిన దాన్ని కప్పిపుంచుకొని పేపర్ నా దగ్గర పెట్టాడు. నేను అతనిని అడిగాను "ఐదు యేండ్ల క్రితం నల్గొండ లో ఇదే విధంగా చెప్పి డబ్బులు తీసుకున్నావు కదా? ఇంకా AMIE పూర్తి కాలేదా లేక ఇదే నీ వ్యాపారమా?" అని. అతను వెంటనే "నేనెప్పుడూ నల్గొండ రాలేదు సార్. నేను ఇప్పుడే జాయిను అయ్యాను. మీరు చెపుతున్న అతనెవరో నాకు తెలియదు" అన్నాడు. నేనేమీ మాట్లాడకుండా "సర్లే వెళ్ళు" అన్నాను. నేను అలా అనటం పాపం వెంటనే అక్కడ్నించి వెంటనే జంపైపోయాడు. ఇద్ జరిగిన కొన్నాళ్ళకి అంటే ఓ 5 యేండ్ల తర్వాత రాజమండ్రి లో ఉన్నప్పుడు మళ్ళీ వచ్చాడు వీడు. ఈ సారి మాంచి నున్నగా తయారయ్యాడు. బాగా కండ పట్టి ఉన్నాడు. మళ్ళీ అదే తంతు. ఈ సారి మాత్రం ఊరుకోలేదు. గట్టిగా అరిచాను వాడిని. చాలా సేపు బుకాయించాడు గానీ ఎక్కువ సేపు అక్కడుండకుండా వెళ్ళిపోయాడు. అదీ సంగతి.

ఇంకా లక్ష రూపాయలు కడితే నెలకి పన్నెండు వేలు చొప్పున రిటర్న్స్ ఇస్తామంటూ వెలసిన సంస్థలు కొన్నాళ్ళకు బోర్డ్ తిప్పేస్తుంటాయి. ఇది కూడా అడుక్కోవటము కిందే లెక్క. మమూలుగా అయితే మీరు పది రూపాయలు కంటే ఎక్కువ భిక్షమెయ్యరు. కానీ మీలోని ఆశని ఎన్ కేష్ చేసుకుంటూ మీ దగ్గర లక్షలు లక్షలు 'అడుక్కొని' ధనవంతులైపోతారన్నమాట. డబ్బులు గల్లంతయ్యాయని తెలిసాక చేసేదేమీ ఉండదు, కొన్ని లక్షలు ఎవడికో దానం చేసామని ఉసూరుమనటం తప్ప.

ఇంతకీ నేను చెప్పిన జవాబేంటంటే "ముఝే హిందీ నహీ మాలూం


No comments:

Post a Comment