Saturday 16 November 2013

నో ఓట్......నో రేషన్

టు వేయకపోతే ప్రభుత్వ సబ్సిడీలు, మరే యితర ప్రభుత్వ ఫలాలు అనుభవించడానికి అర్హత కోల్పోతారు అనే ఓ నిబంధన పెడితే బాగుంటుంది కదా. చచ్చినట్టు అందరూ ఓటు వేస్తారు.

 

4 comments:

  1. నిబంధన పెడతారు సరే, అమలు పరచటం ఎలా. డబ్బులు పుచ్చుకుని వోటు వేశె వాళ్ళ అవినీతి గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. మనందరి అవినీతి కలగలిపి, రాక్షస రూపం దాల్చి, రాజకీయాల్లో కనపదడుతున్నది. మనలో ఉన్న అవినీతి, ఎంత చిన్న విషయంలో ఐనా సరే లేకుండా పోతె కాని, సమాజంలో అవినీతి పోదు.

    ఇక్కడ ఉమ్మెయాచ్చు, ఇక్కడ ఉమ్మేయ్యకూడదు, తిన్న చాక్లెట్ రాపర్ అలా గాలికి పారెయ్యకూడదు, ట్రాఫిక్ లైటు ఎర్ర రంగులో ఉంటె, ఆగాలి, పోలీసు అక్కడ ఉన్నా లెకపోయినా, ఇద్దరు ఉన్నా కూడా క్యూ లో నుంచోవాలి, తోసుకోకూడదు, మనకు అర్హత ఉంటెనే, వాటికోసం తాపత్రయ పడాలి, అనే చిన్న చిన్న విషయాలు పాటించే వాళ్ళు ఎంత మంది! ఇవన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. ఇంత చిన్న విషయాల్లోనే క్రమశిక్షణ లెదే, పెద్ద విషయాల్లో అవినీతి పొమ్మంటె ఎలా పోతుంది. క్రమశిక్షణ లేని జాతి, ఎప్పటికీ అవినీతిని పోగొట్టుకోలేదు.

    ReplyDelete
  2. మీ అభిప్రాయానికి ధన్యవాదములు శివరాంప్రసాద్ గారూ. మీ అభిప్రాయముతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. మనం మారితేనే సమాజం మారుతుంది. నిజమే. కానీ నా ఉద్దేశ్యం ఏమిటంటే ఎన్నికల్లో ఓటు వేసే వారు కేవలం 40 నుండి 50 శాతం మాత్రమే ఉన్నారు ప్రస్తుత సమాజంలో. ఓటు హక్కుని ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలనేది నా అభిప్రాయము. నూటికి నూరు శాతం అందరూ ఓటు వేసే రోజున యిప్ప్పుడున్న ఫలితాలు చాలా వరకూ తారుమారవుతాయని నా ఆశ. నోటుకు ఓటు వేసేవారున్నారు. కానీ అందరినీ ఒకే గాటిన కట్టేయలేము కదా. ఏమంటారు?

    ReplyDelete
  3. @first the fault with the Political Parties, as they did not do some thing to the peoples, thats why the need to purchase the votes, other wise they won't get deposits at least, then the people also habituated to give n get some with payment of some thing only.....so Fault with both parties....but suffering is always @People only.....!!!!!????

    ReplyDelete